ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

70లక్షల మంది మహిళలను మోసం చేసిన సీఎం: టీడీపీ

ABN, First Publish Date - 2021-06-24T07:16:20+05:30

అర్హులందరికీ జగనన్న చేయూత పథకం ద్వారా ఆర్థికసహాయం చేస్తానని చెప్పిన సీఎం జగన్‌.. 70లక్షల మంది మహిళలను మోసం చేశారని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు జి.నరసింహయాదవ్‌ అన్నారు.

మాట్లాడుతున్న నరసింహయాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(తిలక్‌రోడ్డు), జూన్‌ 22: అర్హులందరికీ జగనన్న చేయూత పథకం ద్వారా ఆర్థికసహాయం చేస్తానని చెప్పిన సీఎం జగన్‌.. 70లక్షల మంది మహిళలను మోసం చేశారని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు జి.నరసింహయాదవ్‌ అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 93లక్షల మంది అర్హులైతే రెండో విడత జగనన్న చేయూత పథకం ద్వారా కేవలం 23లక్షల మందికే మంజూరు చేశారన్నారు. మిగిలిన వారిని మోసం చేశారన్నారు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు ఇస్తామన్న జగన్‌.. ఇప్పటి వరకు ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో బ్యాక్‌లాగ్‌ పోస్టుల ఖాళీలు, పోలీసుశాఖలోని ఖాళీలను అసంపూర్తిగా చూపించి నిరుద్యోగులను కూడా మోసం చేశారన్నారు. సంక్షేమపథకాలపై ఎందరికి అందజేస్తున్నారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఎ.రవినాయుడు, మనోహర్‌ఆచ్చారి పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T07:16:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising