వరద పరిస్థితిపై టీటీడీ ఈవోకు సీఎం Jagan ఫోన్
ABN, First Publish Date - 2021-11-19T19:20:30+05:30
తిరుమలలో వరద పరిస్థితిపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డికి సీఎం జగన మోహన్ రెడ్డి ఫోన్ చేశారు.
తిరుమల: తిరుమలలో వరద పరిస్థితిపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డికి సీఎం జగన మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా వరద పరిస్థితిని సీఎంకు ఈవో తెలియజేశారు. వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిస్థితులను బట్టి భక్తులను తిరుమలకు అనుమతించాలని ఈవోకు సీఎం జగన్ తెలిపారు. సీఎం ఆదేశాలతో ఈవో జవహర్ రెడ్డి ఘాట్ రోడ్లను పరిశీలిస్తున్నారు.
Updated Date - 2021-11-19T19:20:30+05:30 IST