ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నా
ABN, First Publish Date - 2021-06-14T14:45:37+05:30
రైల్వే మంత్రి పీయూష్గోయల్..
పీయూష్గోయల్
తిరుమల: రైల్వే మంత్రి పీయూష్గోయల్ ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపానికి చేరుకున్న ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. శ్రీవారి లడ్డూప్రసాదాలను అదనపు ఈవో ధర్మారెడ్డి అందజేశారు. దర్శనం తర్వాత కేంద్రమంత్రి ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ కరోనా పూర్తిగా తొలగిపోయి ప్రజలందరూ ఆరోగ్యంతో సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు. అనంతరం తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు.
Updated Date - 2021-06-14T14:45:37+05:30 IST