శ్రీవారి సేవలో ప్రముఖులు
ABN, First Publish Date - 2021-06-21T06:31:41+05:30
శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
తిరుమల, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి విశ్వరూప్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ జి నిజగన్నవర్ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూప్రసాదాలు అందజేశారు.
Updated Date - 2021-06-21T06:31:41+05:30 IST