ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొంగ ఓట్లు వేయడానికి కుప్పంలో మకాం

ABN, First Publish Date - 2021-11-15T07:38:47+05:30

దొంగ ఓట్లు వేయడానికి పెద్ద దండే కుప్పంలో మకాం వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పంలో దొంగల దండు


తిరుపతి, నవంబర్‌ 14: తిరుపతి ఉప ఎన్నికల వ్యూహాన్నే కుప్పంలో అనుసరించబోతున్నారన్న ప్రచారం నిజమే అవుతోంది. దొంగ ఓట్లు వేయడానికి పెద్ద దండే కుప్పంలో మకాం వేసింది. పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె ప్రాంతాల నుంచి మూడు రోజుల కిందటే పలు రహస్య స్థావరాలకు బయటి వ్యక్తులను తరలించారంటున్నారు. వేల సంఖ్యలోనే నకిలీ ఓటరు కార్డులనూ ఇప్పటికే సిద్ధం చేశారని చెబుతున్నారు. పట్టణంలో అక్కడక్కడా అపరిచితులు కనిపిస్తుండడంతో ఆదివారం నాడు టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.తమను బయటకు బలవంతంగా పంపించి, వైసీపీ వారిని మాత్రం కుప్పంలో ఎలా ఉండనిస్తున్నారంటూ టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదాలకు దిగారు. రహస్య తావుల్లో ఉన్న అపరిచితులను నిలదీశారు.ప్రజలకు స్వేచ్ఛగా ఓట్లు వేయాలని, తాము అండగా ఉంటామని ధైర్యం చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ శ్రేణుల్లో మనోధైర్యం నింపడానికి,స్వేచ్ఛగా ఓటేసేలా ప్రజలను కార్యోన్ముఖుల్ని చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం రానున్నారు.

Updated Date - 2021-11-15T07:38:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising