తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్ బాధ్యతల స్వీకారం
ABN, First Publish Date - 2021-02-26T07:33:57+05:30
తిరుపతి రైల్వేస్టేషన్ను మరింత అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేస్తానని డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ వెల్లడించారు.
తిరుపతి(ఆటోనగర్), ఫిబ్రవరి 25: తిరుపతి రైల్వేస్టేషన్ను మరింత అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేస్తానని డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ వెల్లడించారు. గురువారం ఉదయం రైల్వేస్టేషన్లోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేబోర్డు, దక్షిణమధ్య రైల్వే జోనల్ అధికారుల ఆదేశాల మేరకు తిరుపతి పుణ్యక్షేత్రంలో గ్రేడ్-1గా ఉన్న రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారిస్తానని చెప్పారు. అనంతరం స్టేషన్లోని పలు శాఖల అధికారులు, ఉద్యోగులు డైరెక్టర్కు పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - 2021-02-26T07:33:57+05:30 IST