ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ఆగడాలను వడ్డీతో తిరిగి చెల్లిస్తాం : మాజీ మంత్రి అమర్‌

ABN, First Publish Date - 2021-10-29T05:07:10+05:30

రాష్ట్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అధికార పక్షం జరుపుతున్న ఆగడాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి అమరనాథరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వి.కోట, అక్టోబరు 28: రాష్ట్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అధికార పక్షం జరుపుతున్న ఆగడాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. గురువారం వి.కోట పీఎంఆర్‌ కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. ఇటీవల తాడేపల్లెలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి అయితే అధికారులు మాత్రం ఎవరికీ కొమ్ముకాయరాదన్నారు. డీజీపీ సీఎం చేతిలో కీలుబొమ్మలా మారి వారు చెప్పిందల్లా చేయడం సరికాదని,  టీడీపీ అధికారంలోకి రాగానే అలాంటి అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగు యువత ఆధ్వర్యంలో రాళ్ళబూదుగూరు వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు వి.కోట మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రనాయుడు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు సుబ్బన్న, రాంబాబు, మోహన్‌రావు, సోము, ఈశ్వర్‌, శబరీష్‌, భక్తా, దామోదర్‌నాయుడు, విశ్వనాథ్‌, గుణ, హరి, చంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి, త్యాగరాజ్‌, ఫయాజ్‌, శ్రీనివాసులు, మునిరత్నం, నారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:07:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising