సర్జరీ తర్వాత తొలిసారిగా..!
ABN, First Publish Date - 2021-06-18T06:50:02+05:30
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోగ్య కారణాలతో రెండు నెలల విరామం తర్వాత తొలిసారి నియోజకవర్గంలో గురువారం అడుగు పెట్టారు.
రెండు నెలల విరామం తర్వాత బయటకొచ్చిన రోజా
పుత్తూరు, జూన్ 17: నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోగ్య కారణాలతో రెండు నెలల విరామం తర్వాత తొలిసారి నియోజకవర్గంలో గురువారం అడుగు పెట్టారు. ఒక ఆపరేషన్తో కొంతకాలం ఆసుపత్రిలోనూ, ఆ తర్వాత ఇంట్లోనూ ఆమె విశ్రాంతిలో ఉన్నారు. ప్రజల ఆశీస్సులు, అభిమానంతోనే క్షేమంగా తిరిగి వచ్చానని అన్నారు. దేవుడి మీద నమ్మకంతో తొలుత దేశమ్మగుడి ఆలయంలో నాలుగు లక్షలతో కొత్తగా నిర్మించిన కళ్యాణకట్ట భవనాన్ని, మరో నాలుగు లక్షలతో పునర్న్మించిన నాగాలమ్మ ఆలయాన్ని ఆమె ప్రారంభించారు. ఆ తర్వాత మున్సిపాలిటీ పరిధిలోని సత్రవాడలో రూ.5.5 కోట్లతో నిర్మించనున్న 308 ఇళ్ల జగనన్న కాలనీకి భూమి పూజ చేశారు. ఆ కాలనీలోనే నిర్మించిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే రూ.80 లక్షలతో నిర్మించనున్న సత్రవాడ సచివాలయ వెల్నెస్ భవనానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమాలలో సెల్వమణి, మున్సిపల్ చైర్మన్ నీలమేఘం, వైస్ చైర్మన్ బాలన్, కమిషనరు నాగేంద్రప్రసాద్, తహసీల్దారు చంద్రశేఖర్ రెడ్డి, దేశమ్మగుడి చైర్మన్ బాబురెడ్డి, ఈవో రవీంద్రరాజు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకుడు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-18T06:50:02+05:30 IST