ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీటింగ్‌ కేసులో నిందితుడి అరెస్టు

ABN, First Publish Date - 2021-04-21T05:43:38+05:30

చీటింగ్‌ కేసులో పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించినట్లు తాలూకా ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె క్రైం, ఏప్రిల్‌ 20: చీటింగ్‌ కేసులో పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించినట్లు తాలూకా ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ చెప్పారు. మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ మొలకలదిన్నెకు చెందిన ఇడగొట్టి శ్రీరాములు గతేడాది తనకు చెందిన 18 కుంటల భూమిని మదనపల్లెకు చెందిన తనూజ్‌, ఇతరులకు రూ.28 లక్షలకు విక్రయించి రిజిస్ర్టేషన్‌ చేయించాడు. అయితే అదే 18 కుంటలనూ 2010లో పుంగనూరువాసులకు విక్రయించాడు. ఈనేపథ్యంలో తనూజ్‌, ఆయన తండ్రి శ్రీనివాసులు తాము కొనుగోలు చేసిన భూమిలోకి వెళ్లగా, పుంగనూరు వాసులు అడ్డుపడ్డారు. దీంతో శ్రీరాములు మోసం బయటపడింది. అమ్మిన భూమిని చూపకపోగా, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో తనూజ్‌ ఇటీవల తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు శ్రీరాములుపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరారీలో  ఉన్న శ్రీరాములును మంగళవారం అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - 2021-04-21T05:43:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising