ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్పత్రిలో మహిళ మృతదేహాన్ని వదలివెళ్లిన భర్త

ABN, First Publish Date - 2021-04-21T06:12:27+05:30

భార్య మృతదేహాన్ని తీసుకెళ్లే క్రమంలో నగదు తెస్తానని వెళ్లి తిరుపతికి చెందిన నగేష్‌ అదృశ్యమైన సంఘటన శ్రీకాళహస్తిలో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి అర్బన్‌, ఏప్రిల్‌ 20: అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నగదు తెస్తానని వెళ్లిన భర్త అదృశ్యమైన సంఘటన మంగళవారం శ్రీకాళహస్తిలో జరిగింది. వివరాలివీ.. తిరుపతి నగరం జీవకోనకు చెందని నగేష్‌, మనీషా(30) దంపతులు తిరుమలలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా, ఇటీవల మనీషాకు పచ్చకామెర్లు సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెకు నాటు మందు తినిపించాలని మంగళవారం నగేష్‌ భార్యతో కలసి శ్రీకాళహస్తి వచ్చారు. ఈ నేపథ్యంలో మందు తీసుకోక మునుపే మనీషా అపస్మారకస్థితికి చేరుకుంది. వెంటనే పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి వెళ్లగా, అత్యవసర విభాగ వైద్యులు ఆమెను పరీక్షించి మృతిచెందినట్లు పేర్కొన్నారు. దీంతో భార్య మృతదేహాన్ని తిరుపతికి తీసుకెళ్లేందుకు ఏటీఎంలో నగదు డ్రా చేసుకుని వస్తానని చెప్పిన నగేష్‌ మాయమయ్యాడు. అయితే ఆయన ఎంతసేపటికీ రాకపోవడంతో వైద్య సిబ్బంది మనీషా మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అనంతరం ఆస్పత్రి అధికారులు ఈ సమాచారం శ్రీకాళహస్తి రెండవ పట్టణ పోలీసులకు అందజేశారు. 

Updated Date - 2021-04-21T06:12:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising