8,600 లీటర్ల బయో డీజిల్ సీజ్
ABN, First Publish Date - 2021-12-07T06:21:40+05:30
8,600 లీటర్ల బయో డీజిల్ను కమర్షియల్ ట్యాక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రూ.15.18 లక్షల జరిమానా
చిత్తూరు రూరల్, డిసెంబరు 6: చిత్తూరు-బెంగళూరు బై పాస్ రోడ్డులోని ము ర కంబట్టు ప్రాంతం లో 8,600 లీటర్ల బయో డీజిల్ను స్వాధీనం చేసుకున్నారు. కమర్షియల్ ట్యాక్స్ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మురకంబట్టు ప్రాంతంలో ఓం సాయిరాం లూబ్రికెంట్స్ పేరుతో అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని సమాచారం అందింది. కమర్షియల్ ట్యాక్స్ జేసీ జాన్ స్టీవెన్ సన్ ఆదేశాలతో సోమవారం సంబంధిత వ్యాపార కేంద్రంలో అధికారులు తనిఖీ చేశారు. 8,600 లీటర్ల బయో డీజిల్ను డ్రమ్ముల్లో గుర్తించారు. వీటికి సంబంధించిన ఎటువంటి బిల్లులను నిర్వాహకులు చూపించకపోవడంతో సీజ్ చేశారు. రూ.15.18 లక్షల జరిమానా వసూలు చేసినట్లు జేసీ తెలిపారు.
Updated Date - 2021-12-07T06:21:40+05:30 IST