151 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
ABN, First Publish Date - 2021-05-06T06:15:05+05:30
అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 151 బస్తాల రేషన్ బియ్యాన్ని శ్రీకాళహస్తి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
శ్రీకాళహస్తి అర్బన్, మే 5: అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 151 బస్తాల రేషన్బియ్యం, మూడు వాహనాలను శ్రీకాళహస్తి రెండవ పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ పూర్ణచంద్ర కథనం మేరకు... శ్రీకాళహస్తి పట్టణ శివారులోని ఈదులగుంట నుంచి రేషన్బియ్యం తరలుతున్నట్లు బుధవారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడులు నిర్వహించారు. అక్కడ 7600 కేజీలున్న 151 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు వ్యాన్లు, మినీలారీని సీజ్ చేసి పది మంది కూలీలను అరెస్టు చేశారు. కాగా, ఈ వ్యవహారం నడుపుతున్న కీలకమైన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Updated Date - 2021-05-06T06:15:05+05:30 IST