ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ కేసులు 74

ABN, First Publish Date - 2021-10-19T06:42:45+05:30

చిత్తూరు జిల్లాలో ఆది, సోమవారాల నడుమ 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ బారిన పడి ఒకరు చనిపోగా అదే వ్యవధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 74 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆది, సోమవారాల నడుమ 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ బారిన పడి ఒకరు చనిపోగా అదే వ్యవధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 74 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 245836కు, కొవిడ్‌ మరణాల సంఖ్య 1938కి చేరగా సోమవారం ఉదయానికి జిల్లాలో 920 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు వున్నట్టు ప్రభుత్వ అధికారిక బులెటిన్‌ పేర్కొంది. కాగా కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసులు తిరుపతి నగరంలో 12, తిరుపతి రూరల్‌లో 10, చిత్తూరు, పీలేరు మండలాల్లో 5 వంతున, మదనపల్లెలో 4, శ్రీకాళహస్తి, సదుం, గుడుపల్లె, కుప్పం మండలాల్లో 3 చొప్పున, పుత్తూరు, కేవీపల్లె, పూతలపట్టు, యాదమరి, వాల్మీకిపురం, రామకుప్పం, ఏర్పేడు మండలాల్లో 2 వంతున, పుంగనూరు, చంద్రగిరి, బంగారుపాలెం, రేణిగుంట, చిన్నగొట్టిగల్లు, వెదురుకుప్పం, శ్రీరంగరాజపురం, కలకడ, ఐరాల, సత్యవేడు, బైరెడ్డిపల్లె, ములకలచెరువు మండలాల్లో మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.


14 మంది కరోనా బాధితుల డిశ్చార్జి


తిరుపతి సిటీ, అక్టోబరు 18: స్విమ్స్‌, రుయా ఆస్పత్రుల నుంచి సోమవారం కొవిడ్‌ నుంచి కోలుకున్న 14 మందిని వైద్యులు డిశ్చార్జి చేశారు. 87మంది బాధితులు చికిత్స పొందుతుండగా మరో 38మంది బ్లాక్‌ ఫంగ్‌సతో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-10-19T06:42:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising