ప్రాణదాన పథకానికి 104 మంది ఎంపిక
ABN, First Publish Date - 2021-11-26T06:42:53+05:30
స్విమ్స్లో ప్రాణదానం పథకం కింద ఉచిత శస్త్ర చికిత్సలకు అర్హులైన 104 మంది నిరుపేద రోగులను ఎంపిక చేసినట్లు స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ గురువారం తెలిపారు.
తిరుపతి సిటీ, నవంబరు 25: స్విమ్స్లో ప్రాణదానం పథకం కింద ఉచిత శస్త్ర చికిత్సలకు అర్హులైన 104 మంది నిరుపేద రోగులను ఎంపిక చేసినట్లు స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ గురువారం తెలిపారు. స్విమ్స్లో ఆమె అధ్యక్షతన నిర్వహించిన ప్రాణదాన కమిటీ సమావేశంలో అర్హులను ఎంపిక చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రాణదాన పథకంలో ఉచిత శస్త్ర చికిత్సలు పొందే రోగులు బియ్యంకార్డు కలిగి, దారిద్య్ర రేఖకు దిగువను ఉన్న నిరుపేదలు అర్హులన్నారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల పరిధిలో ఈ పథకం కింద ఎంపికైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తామన్నారు.
Updated Date - 2021-11-26T06:42:53+05:30 IST