జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ను పక్కదారి పట్టించారు: చింతామోహన్
ABN, First Publish Date - 2021-12-16T20:18:20+05:30
ఏపీలో నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్లను చెల్లించకుండా వేల కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ను..
అమరావతి: ఏపీలో నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్లను చెల్లించకుండా వేల కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ను సీఎం జగన్ పక్కదారి పట్టించారని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల డబ్బుతో జగనన్న గోరు ముద్ద పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎలా పెడతారని ప్రశ్నించారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పేరుతో కోట్ల రూపాయల ప్రజల డబ్బును పక్కదారి పట్టించారని మండిపడ్డారు. దేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రాన్ని సీఎం జగన్ భ్రష్టు పట్టించారని చింతామోహన్ ధ్వజమెత్తారు.
Updated Date - 2021-12-16T20:18:20+05:30 IST