కాంగ్రెస్ గురించి పీకే మాట్లాడమేంటి?: చింతామోహన్
ABN, First Publish Date - 2021-10-29T17:22:33+05:30
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డబ్బు మనిషని కాంగ్రెస్ నేత చింతామోహన్ విమర్శించారు.
అమరావతి: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డబ్బు మనిషని, ఆయనకు ఏమి తెలుసునని కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు చింతామోహన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్పై పీకే చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పీకే జర్నలిస్టులను పక్కన పెట్టుకుని వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చూడటానికి చిన్నగా కనిపించవచ్చు కానీ గొప్ప నాయకుడని కొనియాడారు. కాంగ్రెస్ గురించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడమేంటని మండిపడ్డారు. ఆయన ఓ బచ్చగాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీన పడటానికి కారణం ఇద్దరు నాయకులని విమర్శించారు. వారిలో పీవీ నరసింహారావు ఒకరని.. అయోధ్య ఘటనతో మైనార్టీలు దూరమయ్యారన్నారు. రాష్ట్ర విభజనకు కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అన్నారు. చెన్నారెడ్డిని దించేందుకు ఒక నాయకుడు పాతబస్తీలో మారణహోమం సృష్టించారన్నారు. ఆ నాయకుడు ఇప్పుడు లేరని, చనిపోయారని చింతామోహన్ పేర్కొన్నారు.
Updated Date - 2021-10-29T17:22:33+05:30 IST