Gunturలో కిడ్నాపైన శిశువు క్షేమం
ABN, First Publish Date - 2021-10-16T19:08:11+05:30
జీజీహెచ్లో కిడ్నాపైన శిశువు క్షేమంగా దొరికింది. కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీజీహెచ్ సిబ్బంది హేమ వరుణుడు
గుంటూరు: జీజీహెచ్లో కిడ్నాపైన శిశువు క్షేమంగా దొరికింది. కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీజీహెచ్ సిబ్బంది హేమ వరుణుడు, పద్మలను కిడ్నాపర్లుగా గుర్తించారు. గుంటూరు పట్టణంలోని నెహ్రూ నగర్లో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాబును కొత్తపేట సీఐ శ్రీనివాస్రెడ్డి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ నెల 13వ తేదీన ప్రియాంక అనే మహిళ జీజీహెచ్లో బాబుకు జన్మనిచ్చింది. అమ్మమ్మ పసికందును పక్కన పెట్టి నిద్రపోయింది. ఇదే సమయం అనుకున్న దుండగులు బాబుని ఎత్తుకుని పారిపోయారు. నిద్రమత్తులో ఉన్న వారు ఒక్కసారిగా నిద్రలేచి చూసేసరికి బాబు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఈ కేసు చేధించారు.
Updated Date - 2021-10-16T19:08:11+05:30 IST