ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేతలపై ఇంత దౌర్జన్యమా?: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-08-16T19:46:26+05:30

పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతలపై ఇంత దౌర్జన్యమా? అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నేతల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించడం సరికాదని తప్పుబట్టారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతలపై ఇంత దౌర్జన్యమా? అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నేతల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించడం సరికాదని తప్పుబట్టారు. పోలీసుల దౌర్జన్యం ప్రజాస్వామ్య విలువలకు గండికొట్టేలా ఉందన్నారు. దౌర్జన్యానికి పాల్పడ్డ పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హత్యకు గురైన దళిత విద్యార్థిని కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 


విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యుల పరామర్శలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. పరామర్శకు వెళ్లిన టీడీపీ నేత నారా లోకేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు ధూళిపాళ్ల, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబును అరెస్ట్ చేశారు. లోకేష్‌ను ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. మరికొందరు టీడీపీ నేతలు నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2021-08-16T19:46:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising