కుప్పం ఘటనపై చంద్రబాబు విచారం
ABN, First Publish Date - 2021-05-07T09:55:46+05:30
చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్లో కరోనా రోగి మరణించిన సంఘటనపై ఓ ప్రకటనలో చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. గుడిపల్లె మండలం మిద్దూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్కు స్థానికంగా కరోనా చికిత్సకు వైద్యం లభ్యం కాక
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్లో కరోనా రోగి మరణించిన సంఘటనపై ఓ ప్రకటనలో చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. గుడిపల్లె మండలం మిద్దూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్కు స్థానికంగా కరోనా చికిత్సకు వైద్యం లభ్యం కాక ప్రాణాలు కాపాడుకొనేందుకు బెంగళూరు బయలుదేరారని, కాని ఇంతలోనే ఊపిరి అందక కుప్పం రైల్వే స్టేషన్లోనే చనిపోయారని ఆయన చెప్పారు. చంద్రశేఖర్ సోదరుడిని ఆయన ఫోన్లో పరామర్శించి ఈ ఘటనపై సానుభూతిని వ్యక్తం చేశారు. సకాలంలో పడకలు దొరక్క... ఆక్సిజన్ లభ్యం కాక సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితికి ఇది దర్పణం పడుతోందని, ఇప్పటికైనా ప్రభుత్వం కదలాలని చంద్రబాబు అన్నారు.
Updated Date - 2021-05-07T09:55:46+05:30 IST