చంద్రబాబుకే రక్షణ కరువైంది: అయ్యన్నపాత్రుడు
ABN, First Publish Date - 2021-09-17T23:54:49+05:30
టీడీపీ అధినేత చంద్రబాబుకే రక్షణ కరువైంది అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా రక్షించబడుతాయో
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకే రక్షణ కరువైంది అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా రక్షించబడుతాయో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్ 24 గంటల ముందే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని, బహిరంగంగా చెప్పినా బందోబస్తు చర్యలు తీసుకోకపోవడం పోలీసుల తీరుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేసే ఏ కార్యక్రమాన్నయినా నిలువరించే పోలీసులు.. చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించినా పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కన్నబాబు రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యమన్నారు. సన్న బియ్యం అంటే ఏమిటో తెలియని బూతుల మంత్రి.. కొడాలి నాని పౌరసరఫరాల మంత్రిగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టమని అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు.
Updated Date - 2021-09-17T23:54:49+05:30 IST