ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరివెన్నెల‌కు నివాళులర్పించిన చంద్రబాబు

ABN, First Publish Date - 2021-12-01T20:45:36+05:30

సిరివెన్నెల సీతారామశాస్త్రి చిత్రపటానికి టీడీపీ అధినేత చంద్రబాబు పుష్పగుచ్చములుంచి నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చిత్రపటానికి టీడీపీ అధినేత చంద్రబాబు పుష్పగుచ్చములుంచి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీతారామశాస్త్రి లేరనేమాట వినడానికి చాలా బాధగా ఉందన్నారు. ఆయన రాసిన పాటలు ప్రజల మనసుల్లో నాటుకుపోయాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సిరివెన్నెల ఒక ఆస్తి అని, అలాంటి మంచి వ్యక్తి మనముందులేకపోవడం బాధాకరమన్నారు. రాజకీయంగా పాటలు రాయించాలని అనిపించినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది సిరివెన్నెల సీతారామశాస్త్రి అని అన్నారు. ఆయన మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు. సిరివెన్నెల రాసిన పాటలు తెలుగుజాతి ఉన్నంతవరకు ప్రజల గుండెల్లో శాశ్వతంగా గుర్తుంటాయన్నారు. సీతారామశాస్త్రి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ... ఆయన కుటుంబసభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Updated Date - 2021-12-01T20:45:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising