టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై చంద్రబాబు ఆగ్రహం
ABN, First Publish Date - 2021-08-30T17:12:54+05:30
తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీకి లేఖ రాశారు.
అమరావతి: తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన తెలపడం నేరమా? అని ప్రశ్నించారు.
ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని, ఏపీలో వైసీపీ ప్రేరేపిత పోలీసు రాజ్యం కనిపిస్తోందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా అసమ్మతులు ఉంటే వేధిస్తారా? అంటూ మండిపడ్డారు. ప్రజలతో పాటు ప్రతిపక్ష నేతలను పోలీస్ విభాగం వేధిస్తోందని, ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా పోలీసుల చర్యలు ఉన్నాయని చంద్రబాబు ఆ లేఖలో ఆరోపించారు.
Updated Date - 2021-08-30T17:12:54+05:30 IST