ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం

ABN, First Publish Date - 2021-10-04T23:57:32+05:30

టీడీపీ ముఖ్యనేతలతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ ముఖ్యనేతలతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రెండున్నరేళ్లలో ఆరుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి 11,500 కోట్ల భారం మోపారని చెప్పారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో మరో 24,500 కోట్ల భారం మోపారని మండిపడ్డారు. విద్యుత్ చార్జీల పెంపుదలకు నిరసనగా ఈ రోజు నుంచి 31 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. 


ఏపీలో డ్రగ్ మాఫియా చెలరేగిపోతోందని,  మత్తుతో యువతను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ డాన్స్‌గా, స్మగ్లింగ్ కింగ్‌లుగా వైసీపీ ముఖ్యనేతలు అవతారమెత్తారని విమర్శించారు. షెల్ కంపెనీలు సృష్టించి అవినీతికి పాల్పడటంలో జగన్‌రెడ్డి దిట్టన్నారు. పండరో పేపర్స్‌లో జగన్‌రెడ్డి పేరు కూడా ఉండే అవకాశం ఉందన్నారు. ప్రజలకు వాస్తవాలు బహిర్గతం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 


ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి జగన్‌రెడ్డి బినామీగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దొంగ లెక్కలు చూపిస్తూ రాష్ట్ర ఖజానాను దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వీటన్నింటిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారని చెప్పారు. పాఠశాలల్లో కరోనా వ్యాప్తి నియంత్రణకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - 2021-10-04T23:57:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising