ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర సంపదపై దాడి చేస్తున్నారు: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-08-08T19:16:21+05:30

రాష్ట్ర సంపదపై దాడి చేస్తున్నారు: చంద్రబాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: 600 రోజులుగా సాగుతున్న రైతుల పోరాటం ఒక చరిత్ర అని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజా రాజధానికి రైతులు 32,323 ఎకరాలు త్యాగం చేశారని చెప్పారు. రైతులు, రైతు కూలీల న్యాయపోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అమరావతి ఆంధ్రుల రాజధాని మాత్రమే కాదన్నారు. ఆంధ్రులకు రూ. 2 లక్షల కోట్ల సంపద సృష్టించే కేంద్రం అమరావతి అన్నారు. వైసీపీ చేస్తున్నది అమరావతిపై దాడి కాదు.. రాష్ట్ర సంపదపై దాడి చేస్తున్నారని చెప్పారు. విద్వేషంతో ప్రజా రాజధానిని జగన్‌ ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ వల్ల 139 సంస్థలు అమరావతి ప్రాజెక్టు నుంచి వెనక్కి వెళ్లాయని చెప్పారు. అమరావతి అంతానికి వైసీపీ ప్రభుత్వం చేయని కుట్ర లేదన్నారు. ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే.. మరింత ఉద్ధృతమైందని హెచ్చరించారు. 

Updated Date - 2021-08-08T19:16:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising