ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాల్సైట్‌ టెండర్లు రద్దు

ABN, First Publish Date - 2021-04-16T10:05:04+05:30

విశాఖ జిల్లా అనంతగిరి మండలం నిమ్మలపాడులో కాల్సైట్‌ గనుల టెండర్లను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) రద్దు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీఎండీసీ ఉత్తర్వులు

3 వారాలు స్టే విధించిన హైకోర్టు..  ఫలితంగానే టెండర్ల రద్దు


విశాఖపట్నం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లా అనంతగిరి మండలం నిమ్మలపాడులో కాల్సైట్‌ గనుల టెండర్లను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) రద్దు చేసింది. నిమ్మలపాడులోని 8.725 హెక్టార్లలో కాల్సైట్‌ తవ్వకాలకు సంస్థ గత నెలలో ఈ-టెండర్లు ఆహ్వానించింది. గిరిజనుల అనుమతి లేకుండా.. గ్రామసభ తీర్మానం చేయకుండానే వీటిని పిలిచింది. టెండర్లలో గిరిజనులు గానీ, గిరిజన సహకార సొసైటీలు పాల్గొనడానికి వీల్లేని కఠినతర నిబంధనలు విధించింది. ఈ వ్యవహారంలో ఇద్దరు వైసీపీ పెద్దల పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి.


దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది. ఇదే సమయంలో టెండర్‌లో నిబంధనలను సవాల్‌ చేస్తూ నిమ్మలపాడుకు చెందిన అభయ మ్యూచువల్లీ గిరిజన లేబర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. కోర్టు మూడు వారాలపాటు స్టే విధించింది. ఈ నేపథ్యంలో పాలనాపరమైన కారణాలతో కాల్సైట్‌ గనుల టెండర్లు రద్దు చేస్తున్నట్లు గురువారం ఏపీఎండీసీ ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - 2021-04-16T10:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising