జగన్ నటన ముందు రంగస్థల నటులు సరిరారు: బుచ్చి రామ్ప్రసాద్
ABN, First Publish Date - 2021-01-17T18:03:25+05:30
జగన్ నటన ముందు రంగస్థల నటులు కూడా సరిరారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రామ్ప్రసాద్ ఎద్దేవా చేశారు.
అమరావతి: జగన్ నటన ముందు రంగస్థల నటులు కూడా సరిరారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రామ్ప్రసాద్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ చేయాల్సింది గో పూజలు కాదు.. దేవాలయాలపై దాడులు చేసిన వారిని పట్టుకోవాలన్నారు. సీఎం జగన్ హిందూవుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. క్రైస్తవులందరూ జగన్కు మద్దతివ్వాలని బ్రదర్ అనిల్ ప్రార్ధనలు చెయ్యడం మత ప్రచారం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి దోషులను కఠినంగా శిక్షించాలని బుచ్చి రామ్ప్రసాద్ డిమాండ్ చేశారు.
Updated Date - 2021-01-17T18:03:25+05:30 IST