ఉప్పుటేరులోకి దిగి అన్నదమ్ములు మృతి
ABN, First Publish Date - 2021-10-27T01:08:59+05:30
విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలం కోనాడలో
విజయనగరం: విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలం కోనాడలో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొల్పింది. స్థానికంగా ఉండే ఉప్పుటేరులో స్నానానికి దిగిన అన్నదమ్ములు ఊబిలో కూరుకుపోయి ఊపిరి ఆడక మృతి చెందారు. ఇద్దరు ఒక కన్నతల్లి బిడ్డలు కావటంతో ఆ తల్లిని ఓదార్చడం ఎవరి వల్ల కావటం లేదు.. విషయం తెలుసుకున్న పోలీసులు కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను ఆనంద్ 9వ తరగతి, హరీష్ ఇంటర్ విద్యార్థిగా గుర్తించారు. ఇద్దరి అన్నదమ్ముల మృతితో కోనాడా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Updated Date - 2021-10-27T01:08:59+05:30 IST