ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీకి అంటగట్టాలని చూడటం చేతగానితనం

ABN, First Publish Date - 2021-02-26T09:05:33+05:30

తనపై జరిగిన దాడిని టీడీపీకి అంటగట్టాలని చూడటం బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి చేతగానితనానికి నిదర్శనంగా టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు పేర్కొన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు 


అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): తనపై జరిగిన దాడిని టీడీపీకి అంటగట్టాలని చూడటం బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి చేతగానితనానికి నిదర్శనంగా టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు పేర్కొన్నారు. దివంగత ఎన్టీ రామారావుపై దాడి జరిగినట్లు అబద్ధపు ప్రచారం చేయాలని చూడటం విష్ణు అవివేకమని విమర్శించారు. ‘కొలికపూడి శ్రీనివాస్‌ అమరావతి పరిరక్షణ జేఏసీ కన్వీనర్‌. అమరావతి ఉద్యమాన్ని, వ్యక్తిగతంగా శ్రీనివాస్‌ను దళితుడనే చులకన భావంతో విష్ణు వ్యవహరించడమే కాకుండా ఒక పార్టీకి బానిస అని అనడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. ఆ ఘటన పూర్తిగా విష్ణు ఆధిపత్య వికార మనస్తత్వానికి, శ్రీనివాస్‌ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. దీనికి టీడీపీని నిందించడం సరికాదు. దాడుల ఘటనలను టీడీపీ ఎప్పుడూ సమర్థించదు. టీడీపీపై నిందలు వేయాలనే ఆలోచన మానుకొని విష్ణువర్ధన్‌రెడ్డి ఏపీలో సరైన ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తారని, అధికార పార్టీ కులతత్వ పోకడలను తొలగించుకొంటారని ఆశిస్తున్నాం’ అని మాణిక్యాలరావు పేర్కొన్నారు. 

Updated Date - 2021-02-26T09:05:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising