విజయవాడ: ప్రారంభమైన బీజేపీ ముఖ్య నేతల సమావేశం
ABN, First Publish Date - 2021-06-13T17:13:39+05:30
బీజేపీ ముఖ్య నేతల సమావేశం ఆదివారం ఉదయం ప్రారంభమైంది.
విజయవాడ: నగరంలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి పీ. మురళి ధరన్ అధ్యక్షతన ఈ భేటి జరుగుతోంది. ఈ కార్యక్రమానికి నేషనల్ జాయింట్ సెక్రటరీ శివ ప్రకాష్ సింగ్, సోమూ వీర్రాజు, పురంధేశ్వరి, సత్యకుమార్, కన్నా లక్ష్మినారాయణ, నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతం, ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించి కార్యాచరణ రూపొందించే అవకాశమున్నట్లు సమాచారం.
అంతకుమందు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మురళీధరన్కు ఎయిర్ పోర్టులో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.
Updated Date - 2021-06-13T17:13:39+05:30 IST