బీజేపీ నేతల విమర్శలకే సమాధానం ఇస్తున్నాం: సజ్జల
ABN, First Publish Date - 2021-08-07T21:59:17+05:30
అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం జగన్పై కేసులు పెట్టారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.
అమరావతి: అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం జగన్పై కేసులు పెట్టారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ కేసులపై మాట్లాడటం బీజేపీ దివాళాకోరుతనమన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే పనిచేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏమైనా నోట్లు ముద్రించుకున్నాయా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతల విమర్శలకే సమాధానం ఇస్తున్నామని తెలిపారు. పోలవరం నిధులు తెప్పించి క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.
Updated Date - 2021-08-07T21:59:17+05:30 IST