ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాల, మాదిగల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోంది: కత్తి మహేష్

ABN, First Publish Date - 2021-04-05T02:28:03+05:30

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో మాల, మాదిగల మధ్య బీజేపీ కులాల చిచ్చు పెడుతోందని సినీ విమర్శకులు కత్తి మహేష్ దుయ్యబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో మాల, మాదిగల మధ్య బీజేపీ కులాల చిచ్చు పెడుతోందని సినీ విమర్శకులు కత్తి మహేష్ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మిగతా పార్టీలు మాదిగలకు సీటు ఇవ్వలేదని, బీజేపీ మాదిగలకు సీటు ఇచ్చామంటున్నారని, గెలవలేని చోట మాదిగలకు ఎంపీ సీటు ఇచ్చారని తప్పుబట్టారు. గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి కత్తి రత్నప్రభకు రాజ్యసభ సీటు ఇవ్వచ్చుకదా అని ప్రశ్నించారు. విభజన హామీ చట్టంలో పేర్కొన్న హామీలు తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్నాయని, దుగరాజపట్నం ఓడరేవు, తిరుపతి స్మార్ట్ సిటీ వంటి హామీలను బీజేపీ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు పాచి పోయిన లడ్డు ఇప్పుడు మంచి లడ్డు అయిందా అని కత్త మహేష్ ప్రశ్నించారు.

Updated Date - 2021-04-05T02:28:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising