ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ భారీ ధర్నా

ABN, First Publish Date - 2021-12-05T02:49:52+05:30

ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భారీ ధర్నా చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ధర్నాకు బీజేపీ జాతీయ నేతలను ఆహ్వానించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భారీ ధర్నా చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ధర్నాకు బీజేపీ జాతీయ నేతలను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే చలో తాడేపల్లి కార్యక్రమంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతిపై తీవ్రస్థాయిలో ఉద్యమం చేపట్టాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే మోదీ శంకుస్థాపన చేసి రూ.2500 కోట్ల నిధులు ఇచ్చిన రాజధానిని, ఎలా మారుస్తారని పలువురు బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. కేంద్రాన్ని అడిగే చేస్తున్నామన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను నేతలు తప్పుబట్టారు. ఈ ప్రచారం పూర్తిగా అసత్యమని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో కేంద్రానికి సంబంధం లేదన్న విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నేతలు సూచించారు.

Updated Date - 2021-12-05T02:49:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising