ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలను రోడ్ల పైకితెచ్చి బిచ్చగాళ్లుగా మారుస్తారా?: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-03-08T02:03:21+05:30

రేషన్ కోసం పేదలను రోడ్ల పైకితెచ్చి బిచ్చగాళ్లుగా మారుస్తారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రేషన్ కోసం పేదలను రోడ్ల పైకితెచ్చి బిచ్చగాళ్లుగా మారుస్తారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వారంలోనే అందరికీ బియ్యం అందేదన్నారు. ఇప్పుడు నెలకు 10 శాతం మందికి కూడా రేషన్‌ ఇవ్వలేకపోతున్నారని తప్పుబట్టారు. జగన్ ప్రభుత్వం రేషన్ గోనెసంచులను కూడా వదలడం లేదని చంద్రబాబు ఆరోపించారు. జే-ట్యాక్స్ కోసం రేషన్ డీలర్ల వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. కమీషన్ల కోసం వాహనాలను కొని ప్రజలను ఇక్కట్లు పెట్టారని దుయ్యబట్టారు. డీలర్లకు కేజీకి 20 పైసలు ఉన్న కమీషన్‌ను టీడీపీ ప్రభుత్వం వచ్చాక రూపాయికి పెంచిందని తెలిపారు. కరోనా బారినపడి చనిపోయిన రేషన్ డీలర్లకు రూ.50 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే రేషన్ డీలర్లను కొనసాగిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

Updated Date - 2021-03-08T02:03:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising