ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాపులు, బీసీలు కలిస్తే రాజ్యాధికారం: కేసన

ABN, First Publish Date - 2021-01-22T08:04:07+05:30

కాపులు, బీసీలు కలసి పయనిస్తే రాజ్యాధికారం సాధించవచ్చని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముద్రగడ మద్దతు కోరిన బీసీ సంఘాల నేతలు 


కిర్లంపూడి, జనవరి 21: కాపులు, బీసీలు కలసి పయనిస్తే రాజ్యాధికారం సాధించవచ్చని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసంలో బీసీ నాయకులు గురువారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. తన ఆహ్వానం మేరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన బీసీ నాయకులను ముద్రగడ సాదరంగా ఆహ్వానించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ముద్రగడ వా రందరితో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శంకర్రావు బీసీలు పెట్టబోయే పార్టీకి మద్దతు ఇవ్వాలని ముద్రగడను కోరారు. బడుగు, బలహీనవర్గాలకు ముద్రగడ అండగా ఉంటే తమ బీసీల పార్టీకి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఈ విషయమై ముద్రగడ తన వర్గీయులతో మాట్లాడి నిర్ణయం తెలియజేస్తానని చెప్పారు.

Updated Date - 2021-01-22T08:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising