బాక్సైట్ను జగన్ అండ్ కో ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు: చంద్రబాబు
ABN, First Publish Date - 2021-09-06T21:57:56+05:30
విశాఖ మన్యంలో బాక్సైట్ను జగన్ అండ్ కో ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.
అమరావతి: విశాఖ మన్యంలో బాక్సైట్ను జగన్ అండ్ కో ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. పంట రుణాలు, ఎరువులు, పంట బకాయిలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. దశలవారీ మద్యపాన నిషేధమంటూ ప్రజలను నమ్మించి మోసం చేశారని తప్పుబట్టారు. ధరల పెంపుతో పాటు నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నారని మండిపడ్డారు. మద్యంలో ఇప్పటికే రూ.25వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రెండేళ్ల జగన్ పాలనలో ఎక్కడా ఒక్క రోడ్డు వేయలేదని తెలిపారు. జగన్రెడ్డి అండ్ కో అప్పులు చేసిందని లూఠీ కోసమేనని చంద్రబాబు ఆరోపించారు.
Updated Date - 2021-09-06T21:57:56+05:30 IST