బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్
ABN, First Publish Date - 2021-10-07T17:07:56+05:30
బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.
కడప జిల్లా: బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అభ్యర్థి పేరును ప్రకటించారు. జాతీయ పార్టీ ప్రకటించిన జాబితాను విడుదల చేశారు. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఇటీవలే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
Updated Date - 2021-10-07T17:07:56+05:30 IST