ఆలయాలపై దాడులు..దోషులను కఠినంగా శిక్షించాలి
ABN, First Publish Date - 2021-01-18T08:58:53+05:30
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆలయాలపై దాడులకు పాల్పడిన దోషులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వాన్ని కోరిన స్వరూపానంద
సింహాచలం, జనవరి 17: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆలయాలపై దాడులకు పాల్పడిన దోషులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రభుత్వాన్ని కోరారు. సింహాచల దేవస్థానం పూదోటలో ఆదివారం ఏర్పాటు చేసిన జలహారతిలో ఆయన పాల్గొన్నారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు జరగకుండా చూడాలని అన్నారు. ఆలయాలపై దాడులకు పాల్పడాలంటే భయపడేలా శిక్షలు ఉండాలని సూచించారు.
Updated Date - 2021-01-18T08:58:53+05:30 IST