టీడీపీ మద్దతుదారుల ఇంటిపై దాడి
ABN, First Publish Date - 2021-03-05T09:42:44+05:30
తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం రాంగోపాలపురంలో బుధవారం రాత్రి వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది.
ఎటపాక, మార్చి 4: తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం రాంగోపాలపురంలో బుధవారం రాత్రి వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. తొలుత గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు టీడీపీ మద్దతుదారులపై బాసవాగు, రాంగోపాలపురం గ్రామాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. మూకుమ్మడిగా కర్రలతో దాడి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్నందునే తమపై దౌర్జన్యం చేశారని దివ్యాంగురాలు నాగమణి చెప్పింది.
Updated Date - 2021-03-05T09:42:44+05:30 IST