చీము, నెత్తురుంటే జగన్ రాజీనామా చేయాలి : అచ్చెన్న
ABN, First Publish Date - 2021-05-08T17:42:19+05:30
కరోనా కట్టడిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి విఫలమయ్యారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు. శనివారం ఏర్పాటు
అమరావతి : కరోనా కట్టడిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి విఫలమయ్యారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అచ్చెన్న మాట్లాడుతూ.. చీము, నెత్తురుంటే జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చదువురాని వ్యక్తి సీఎంగా ఉన్నా ప్రజలు రాష్ట్రాన్ని కాపాడేవారని విమర్శించారు. జగన్ పొరుగు రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. కేసుల భయంతోనే ప్రధాని మోదీని సీఎం పొగుడుతున్నారని అచ్చెన్న ఎద్దేవా చేశారు. కేసులు పెట్టాల్సింది చంద్రబాబుపై కాదని.. ప్రజల చావుకు కారణమవుతున్న జగన్పై కేసులు పెట్టాలని అచ్చెన్న ధ్వజమెత్తారు.
Updated Date - 2021-05-08T17:42:19+05:30 IST