భూముల వివరాలను ప్రభుత్వం ఇప్పటికీ తేల్చలేదు: అశోక్గజపతిరాజు
ABN, First Publish Date - 2021-08-11T03:36:00+05:30
భూముల వివరాలను ప్రభుత్వం ఇప్పటికీ తేల్చలేదు: అశోక్గజపతిరాజు
విజయనగరం: మాన్సస్ అనేది సొంత వ్యవహారం కాదని టీడీపీ నేత అశోక్గజపతిరాజు అన్నారు. మాన్సస్, దేవాలయ భూములు సొంత ఆస్తులు కాదని, సింహాచల దేవస్థాన భూములపై గత రెండేళ్లుగా విచారణ, వైసీపీ ప్రభుత్వం భూముల వివరాలు ఇప్పటికీ తేల్చలేదని అశోక్గజపతిరాజు మండిపడ్డారు. తాజాగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విచారణ అంటూ సాగదీస్తున్నారని ఆయన ఆరోపించారు. కోర్టులు తప్పబడుతున్నా ప్రభుత్వం తప్పులు చేయడం మానడం లేదని అశోక్గజపతిరాజు విమర్శించారు.
Updated Date - 2021-08-11T03:36:00+05:30 IST