ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారి మరణాలకు జగన్ రెడ్డే కారణం:అశోక్‌బాబు

ABN, First Publish Date - 2021-09-05T17:55:55+05:30

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఎంత మంది వృద్ధులను బలి తీసుకుంటారని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. పెన్షన్ దారుల మరణాలకు ముఖ్యమంత్రే కారణమన్నారు. తొలగించిన 3 లక్షల పెన్షన్లను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వయోవృద్ధులకు పెన్షన్ దూరం చేయడమే జగన్ రెడ్డి సాధించిన ప్రగతి అని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రాల వారిని సలహాదారులుగా తీసుకొచ్చి లక్షల్లో జీతాలు ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. 28 నెలలుగా గుర్తుకురాని అనర్హత ఇప్పుడే గుర్తొచ్చిందా అని నిలదీశారు. పెన్షన్ పెంచకపోవడం వల్ల ఒక్కొక్కరు రూ.3,250 నష్టపోయారన్నారు. తొలగించిన పెన్షన్లు పునరుద్ధరించకపోతే ప్రభుత్వం చేతకాని తనాన్ని నడివీధుల్లో ఎండగడతామని అశోక్‌బాబు అన్నారు.

Updated Date - 2021-09-05T17:55:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising