వైసీపీ నేతల మోచేతి నీళ్లు తాగుతున్న పోలీసులు: అశోక్బాబు
ABN, First Publish Date - 2021-01-02T21:28:13+05:30
రామతీర్థం సందర్శనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ని ఏ చట్టప్రకారం..
అమరావతి: రామతీర్థం సందర్శనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ని ఏ చట్టప్రకారం పోలీసులు అడ్డుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు ప్రశ్నించారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయకుండా వైసీపీ నేతల మోచేతి నీళ్లు తాగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రోడ్డుపై ధర్నా చేస్తేగానీ డీజీపీకి బుద్ధి రాలేదా అని నిలదీశారు. విజయసాయిరెడ్డికి ఇచ్చిన గౌరవం, మాజీ సీఎంకు ఇవ్వరా అని అశోక్బాబు తప్పబట్టారు.
Updated Date - 2021-01-02T21:28:13+05:30 IST