స్కూల్ ఫీజు ఎంత అనేది చెప్పలేకపోతున్నాం: ఆలూరి సాంబశివ రెడ్డి
ABN, First Publish Date - 2021-08-26T23:27:20+05:30
రాష్ట్రంలోని పాఠశాలల్లో ఎంత ఫీజు అనేది తెలియకుండా ఎక్కువ ఫీజు ఏదో అని
అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల్లో ఎంత ఫీజు అనేది తెలియకుండా ఎక్కువ ఫీజు ఏదో అని చెప్పలేకపోతున్నామని ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ కార్యదర్శి ఆలూరి సాంబశివ రెడ్డి అన్నారు. కొంతమంది మేనేజ్మెంట్లు తామే GO MS 1 ప్రకారం ఫీజు ఫిక్స్ చేసుకుంటాం అని అంటున్నాయని ఆయన తెలిపారు. పేరెంట్స్, పిల్లలు, టీచర్స్, ఎవరైనా తమ ఫిర్యాదులను 9150381111కు ఉ.10 నుంచి సా.5 గంటల మధ్య కాల్ చేసి ఫిర్యాదు చేయచ్చని ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వారంలోగా చర్యలు తీసుకుంటామని ఆలూరి తెలిపారు. ఇప్పుడు రెగ్యులేటరీ కమిషన్ వచ్చిందని, ఇప్పుడు ఫీజు ఫిక్సేషన్ తామే చేస్తున్నామన్నారు. ఫీజు ఎక్కువ ఉంటే తాము ఇచ్చిన జీఓ ప్రకారం యాజమాన్యాన్ని తల్లిదండ్రులు అడుగుతారన్నారు.
Updated Date - 2021-08-26T23:27:20+05:30 IST