ఏపీకి జీఎస్టీ పరిహారం 905 కోట్లు
ABN, First Publish Date - 2021-10-29T08:59:43+05:30
ఏపీకి జీఎస్టీ పరిహారం 905 కోట్లు
న్యూఢిల్లీ, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ పరిహారం కింద ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.905.59 కోట్లు విడుదల చేసింది. ఏపీ సహా 26 రాష్ట్రాలకు కలిపి రూ.44వేల కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.59లక్షల కోట్ల రుణాన్ని తీసుకొని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించాలని 43వ జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకున్న సంగతిని గుర్తుచేసింది. ఇప్పటి వరకు రాష్ట్రాలకు రూ.1.15లక్షల కోట్లు చెల్లించామని తెలిపింది.
Updated Date - 2021-10-29T08:59:43+05:30 IST