ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుషికొండలో పర్యావరణ విధ్వంసం

ABN, First Publish Date - 2021-10-28T08:38:11+05:30

రుషికొండలో పర్యావరణ విధ్వంసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగుదేశం పార్టీ ఆగ్రహం.. భారీ అందోళన


విశాఖపట్నం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ‘‘రుషికొండలో మంచి ఆదాయం తెస్తున్న హరిత రిసార్ట్స్‌ను కూల్చివేసి ఎవరి కోసం భారీ నిర్మాణాలు చేపడుతున్నారో ప్రకటించాలి. దాని సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి’’ అని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. పర్యాటకం పేరుతో అనుమతులు లేకుండా పనులు చేపట్టడం, గ్రీన్‌బెల్ట్‌ ధ్వంసం, బస్టాపుల కూల్చివేత తదితర అంశాలపై రుషికొండలో బుధవారం ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి,  పీలా గోవింద్‌ మాట్లాడారు. ‘‘కేంద్ర పర్యావరణ శాఖ, గనుల శాఖ అనుమతులు లేకుండా ప్రభుత్వం పనులు చేపడుతోంది. సీఎం కార్యాలయం కోసమే నిర్మాణాలు చేపడుతున్నారన్న అనుమానాలను నివృత్తి చేయాలి. అంతవరకు పనులు నిలిపివేయాలి. ఎంపీ నిధులతో నిర్మించిన బస్టా్‌పను కూల్చివేయడం సరికాదు. విశాఖపట్నాన్ని ధ్వంసం చేయడమే ధ్యేయంగా జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోంది. హరిత రిసార్ట్స్‌ను కూల్చివేసి, సీఎం కోసం క్యాంపు కార్యాలయం, గెస్ట్‌హౌస్‌, విజయసాయిరెడ్డి కుమార్తెకు బహుమతిగా క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మించడానికి యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో దేవుడి భూములను కూడా అధికార పార్టీ నేతలు కాజేస్తున్నారు’’ అని వారు ఆరోపించారు. ఈ ఆందోళనలో పాల్గొనకుండా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును హౌస్‌ అరెస్ట్‌ చేశారు. టీడీపీ ఆందోళనను అడ్డుకోవడానికి పోలీసులు భారీగా మొహరించారు.

Updated Date - 2021-10-28T08:38:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising