గురుకుల ర్యాంకర్లకు సీఎం అభినందనలు
ABN, First Publish Date - 2021-10-27T09:06:43+05:30
గురుకుల ర్యాంకర్లకు సీఎం అభినందనలు
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థులు ప్రతిభ చూపించి అఖిల భారత సర్వీసు (ఐఎఎ్స)లకు ఎంపికవువుతున్నారని.. ఇందుకు సీఎంఓ కార్యదర్శి రేవు ముత్యాలరాజే ప్రత్యక్ష ఉదాహరణ అని సీఎం పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల్లో చదివి ఐఐటీలో అత్యున్నత ర్యాంకులు సాధించిన విద్యార్థుల బృందం మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసింది. ఈ సందర్భంగా విద్యార్థులను జగన్ అభినందిస్తూ.. వారికి ల్యాప్టా్పలను బహూకరించారు. భవిష్యత్లో వారికి ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని సీఎం హామీ ఇచ్చారు.
Updated Date - 2021-10-27T09:06:43+05:30 IST