ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సమస్యలపై టీడీపీ ఆందోళన

ABN, First Publish Date - 2021-09-18T09:48:23+05:30

రైతు సమస్యలపై టీడీపీ ఆందోళన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరిట శుక్రవారం ఆ పార్టీ నాయకులు విశాఖ జిల్లాలో పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నర్సీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎడ్లబండ్లతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లబోగా పోలీసులు అడ్డుకున్నారు. అరకులోయలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, దొన్నుదొర, అబ్రహంను, పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని, మాడుగులలో మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, పైలా ప్రసాద్‌ను అరెస్టుచేశారు. పెందుర్తిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి నేతృత్వంలో ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లిలో టీడీపీ నేతలు బుద్ద నాగేశ్వరరావు, పీలా గోవింద్‌ను, మునగపాకలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, ఎలమంచిలి ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. 

Updated Date - 2021-09-18T09:48:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising