ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక హోదాకు అమిత్ షా పంగనామాలు: శైలజానాథ్

ABN, First Publish Date - 2021-11-16T23:20:56+05:30

ఏపీ ప్రత్యేక హోదాకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా పంగనామాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ప్రత్యేక హోదాకు కేంద్ర హోం శాఖా మంత్రి  అమిత్ షా పంగనామాలు పెట్టారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. ఏ ముఖం పెట్టుకుని రాష్ర్టంలో అడుగు పెట్టారని ఆయన ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ రెడ్డి మెడలు దించి కేంద్రం ఎదుటసాగిలపడ్డారన్నారు. చంద్రబాబు గ్రాఫిక్స్ మాయాజాలంతో ఏపీని అయోమయప్రదేశ్‌గా మారిస్తే, ఒక్క అవకాశం అన్న జగన్ రెడ్డి ఏపీని దివాళా ప్రదేశ్‌గా చేశారని ఆయన ఆరోపించారు. దక్షిణ ప్రాంతీయ సదస్సులో రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం జగన్ రెడ్డి.. రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసి అమిత్ షా నైతికత కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-16T23:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising