జగతి కేసు నుంచి నా పేరు తొలగించండి
ABN, First Publish Date - 2021-10-13T08:31:50+05:30
జగతి కేసు నుంచి నా పేరు తొలగించండి
సీబీఐ-ఈడీ కోర్టులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్
హైదరాబాద్; అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల వ్యవహారంలో జగతి పబ్లికేషన్స్పై ఈడీ దాఖలు చేసిన చార్జిషీటు నుంచి తన పేరు తొలగించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సీబీఐ-ఈడీ ప్రత్యేక కోర్టును కోరారు. ఈ మేరకు మంగళవారం డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. జగతి పబ్లికేషన్స్ కేసులో మనీలాండరింగ్ జరగలేదని జగన్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి తెలిపారు. దీనిపై మీ సమాధానం ఏమిటని ఈడీని కోర్టు అడుగగా.. కౌంటరు దాఖలుకు సమయం కావలని ఈడీ కోరింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 25కి వాయిదా వేసింది.
Updated Date - 2021-10-13T08:31:50+05:30 IST