రాష్ట్రానికి బీజేపీ, వైసీపీ శని, రాహు గ్రహాలు: తులసిరెడ్డి
ABN, First Publish Date - 2021-01-17T08:30:11+05:30
‘‘రాష్ట్రాన్ని బీజేపీ, వైసీపీ... శని, రాహు గ్రహాల్లా పట్టి పీడిస్తున్నాయి. డీజీపీ గౌతం సవాంగ్ ద్వంద్వ వైఖరితో పోలీసులు ప్రజా విశ్వాసాన్ని కోల్పోతారు’’ అని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నర్రెడ్డి తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు.
అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రాన్ని బీజేపీ, వైసీపీ... శని, రాహు గ్రహాల్లా పట్టి పీడిస్తున్నాయి. డీజీపీ గౌతం సవాంగ్ ద్వంద్వ వైఖరితో పోలీసులు ప్రజా విశ్వాసాన్ని కోల్పోతారు’’ అని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నర్రెడ్డి తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. హస్తినలో దోస్తీ, రాష్ట్రంలో కుస్తీ అన్నట్లుగా ఈ పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నాయని విమర్శించారు. మత రాజకీయాలతో ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడి పందాలకు లేని కరోనా, ఎన్నికలకే అడ్డొచ్చిందా? అని సీఎం జగ న్ను నిలదీశారు.
Updated Date - 2021-01-17T08:30:11+05:30 IST